దేశంలోనే స్కిల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ : వైఎస్ జగన్

దేశంలోనే స్కిల్డ్  డెవలప్మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్  :  వైఎస్ జగన్

దేశంలోనే స్కిల్డ్  డెవలప్మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.  స్కిల్డ్  పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసిందని జగన్ అరోపించారు. ఇది రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని అన్నారు.  ఇలాంటి గొప్ప స్కామ్  నడిపిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు. స్కిల్డ్  స్కామ్ లో చంద్రబాబు పాత్రపై ఆధారాలు చూపిస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ ముఠాగా ఏర్పడి  ఓ పద్దతి ప్రకారం రూ.371 కోట్లు దోచేశారని జగన్ ఆరోపించారు.  

షెల్ కంపెనీల ద్వారా డబ్బులను మళ్లించి స్కామ్ కు పాల్పడ్డారని జగన్ చెప్పారు.   ప్రజాధనాన్ని దోచేయడంలో బాబు ఎంత చాణిక్యుడో ఈ స్కామ్ ఓ ఊదహరణ అని చెప్పారు.  స్కామ్ చేయడం దాని నుంచి తప్పించుకోవడం వరకు  బాబు విజన్ కనిపిస్తుందని జగన్  విమర్శించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నదే  బాబు విధానమని అన్నారు. ఈ స్కామ్ పై పవన్ కళ్యాణ్​ ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలని జగన్ ప్రశ్నించారు.