ఆరోగ్యశ్రీ రూ. 25 లక్షలకు పెంపు.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డుల పంపిణీ

 ఆరోగ్యశ్రీ రూ. 25 లక్షలకు పెంపు.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డుల పంపిణీ

ఆరోగ్యశ్రీలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నమాన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డి. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ ఓ వరం లాంటిదన్నారు.  అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. 

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 25 లక్షలకుపెంచుతున్నామని.. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేస్తున్నాని తెలిపారు.  4 కోట్ల 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేశామన్నారు.

 గత ప్రభుత్వ హయాంలో అవసరమైనన్ని 104,108 వాహనాలు అందుబాటులో ఉండేవి కావన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో104, 108 కింద 2,200వాహనాలు తిరుగుతూ పేద ప్రజలకు అత్యంత వేగంగా వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాదులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశామని.. ఆ వ్యాది పూర్తిగా నయం అయ్యేంతవరకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని చెప్పారు సీఎం జగన్.  ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్యశ్రీని అందించామని చెప్పారు. రోగి పూర్తిగా కోలుకునేంతవరకూ జీవనొపాధి కింద ఆరోగ్య ఆసరా ఇస్తు్న్నామన్నారు. 

వైద్యరంగంలో సంస్కరణలకు 55 నెలల కాలంలో రూ.32,279 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని అడుగులు వేస్తున్నామని.. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.