తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశం

 బీఆర్ఎస్ ​పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్​లో నిర్వహించాలని పార్టీ చీఫ్​ కేసీఆర్​ నిర్ణయించారు. పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ ​పార్టీ సహా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జెడ్పీ చైర్​పర్సన్లు, స్టేట్​ లెవల్​ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్​ చైర్​పర్సన్లను ఆహ్వానించారు. ఎలక్షన్ ​ఇయర్ ​నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లడం, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆహ్వానించిన వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.