
ప్రగతి భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో జాతీయజెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం అంబేడ్కర్, మహాత్మాగాంధీ మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజరైన సీఎం కేసీఆర్.. పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలోనే వీరుల సైనిక స్మారకం దగ్గర సర్వమత ప్రార్థనలు చేశారు. త్రివిధ దళ అధికారులు కూడా పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు.