ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని వసంత్ విహార్ లో కొత్తగా నిర్మిస్తోన్న టీఆర్ఎస్ భవన్ పనులను సీఎం కేసీఆర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవనం పనులు ఎంత వరకు వచ్చాయని కాంట్రాక్టర్, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్, వడ్డే రవిచంద్ర, దామోదర్ రావు ఉన్నారు. కాగా..2021 సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్ఎస్ భవన్కు కేసీఆర్ భూమి పూజ చేశారు.

ములాయం అంత్యక్రియల్లో  పాల్గొనేందుకు మంగళవారం యూపీకి వెళ్లిన సీఎం... అటు నుంచే అటే ఢిల్లీకి వెళ్లారు. బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్మిస్తోన్న టీఆర్ఎస్ భవన్ కాస్త బీఆర్ఎస్ భవన్ గా మారే అవకాశం ఉంది.