ప్రజలను ఆదుకునేందుకు దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు

ప్రజలను ఆదుకునేందుకు దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు

హైదరాబాద్: భారీ వర్షాలు.. వరదల వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగితే మొత్తం హైదరాబాద్ మునిగిపోయిందని అని ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. గత పాలకుల పాపమే హైదరాబాద్ లో ఈ పరిస్థితి కి కారణమని ఆయన పేర్కొన్నారు. వర్షాల బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలపై రాష్ట్ర మంత్రులు స్పందించగా మంత్రి తలసాని తనదైన శైలిలో స్పందించారు. ఏ కష్టమొచ్చినా ప్రజలను ఆదుకునేందుకు దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడని మంత్రి తలసాని పొగడ్తల వర్షం కురిపించారు. వర్షాలకు నష్టపోయిన వారంతా ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు వాడుకోవాలని మంత్రి తలసాని సూచించారు.

డిప్యూటీ సీఎం మహమూద్ అలి మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రతిపక్షాలు ఏమి చేయడం లేదన్నారు. మూసీ ని సుందరీకరించేదుకు సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా సిద్దం చేశారని చెప్పారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. వానల నుంచి ప్రజలను కాపాడే వరకు టీఆర్ఎస్ నాయకులు ఎవరూ నిద్రపోకుండా పనిచేస్తున్నారని చెప్పారు.