కార్పొరేట్​ కంపెనీల దళారి కేటీఆర్​

కార్పొరేట్​ కంపెనీల దళారి కేటీఆర్​
  • కార్పొరేట్​ కంపెనీల దళారి కేటీఆర్​
  • అమెజాన్​కు పేదల భూములు ఇస్తున్నరని ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్తలేరు
  • హైటెక్ ​సిటీ దగ్గర స్థలాలను పార్థసారథికి ఇచ్చింది నిజం కాదా? 
  •  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

దేవరకొండ(చందంపేట),వెలుగు:  ధరణి వల్ల రైతులకు ఎదురవుతున్న సమస్యలపై తాను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని సీఎం కేసీఆర్​ తనను సన్నాసి అని, తనది సన్నాసి యాత్ర అని అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గన్నెర్లపల్లి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్​ను సన్నాసి అనాలంటే తనకు సభ్యత, సంస్కారం అడ్డు వస్తున్నాయన్నారు. అత్యంత సంపద కలిగిన అమెజాన్​కంపెనీకి పేదల భూములను అప్పగిస్తున్నారని తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.హైటెక్​ సిటీ దగ్గర విలువైన భూములను బండి పార్థసారథికి అప్పనంగా అప్పగించిన మాట వాస్తవం కాదా అని అడిగారు. కార్పొరేట్​కంపెనీలకు మంత్రి కేటీఆర్​దళారీగా వ్యవరిస్తున్నాడని ఆరోపించారు. ధరణి సాఫ్ట్ వేర్​తో తండ్రీ, కొడుకులు భూ కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. అధికారం లోకి రాగానే బీఆర్ఎస్​ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్​నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్​ ఆదివాసీ జాతీయ కో ఆర్డినేటర్​నేనావత్​ కిషన్​నాయక్​, పీసీసీ మెంబర్​బీల్యానాయక్, జాలె నర్సింహారెడ్డి  పాల్గొన్నారు.