సాగర్ ఎడమ కాల్వకు నీళ్లివ్వండి..ఇంజినీర్లకు కేసీఆర్ ఆదేశం

సాగర్ ఎడమ కాల్వకు నీళ్లివ్వండి..ఇంజినీర్లకు కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఇంజినీర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఆయకట్టు ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిని విడుదల చేయాలని కోరుతుండటంతో సీఎం ఇరిగేషన్ అధికారులతో గురువారం రివ్యూ చేశారు. సాగర్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ వాటాగా నిల్వ ఉన్న నీళ్లను శుక్రవారం నుంచి ఎడమ కాల్వ ఆయకట్టుకు విడుదల చేయాలని సూచించారు.

20 రోజుల తర్వాత ఇంకో తడి నీటిని విడుదల చేయాలన్నారు. కృష్ణా బేసిన్‌‌‌‌లో సరైన వర్షాలు లేకపోవడంతో సాగర్‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, దీంతో నీటిని పొదుపుగా ఉపయోగించుకుంటూ పంటలు సాగు చేయాలని రైతులకు కేసీఆర్ సూచించారు. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందేలా మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపాలని ఆదేశించారు.