నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 70 ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే నవంబర్28 సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రచార సభలు ఉండనున్నట్టు సమాచారం. నవంబర్15 నుంచి వరుసగా కేసీఆర్ సభలు ఉండే అవకాశముంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై బీఆర్ఎస్ చీఫ్ ఎక్కువగా ఫోకస్చేసినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక ప్రచార సభ ఉంటుందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్రావడంతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండేసి ప్రచార సభల్లో పాల్గొననున్నట్టు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేటీఆర్రోడ్షోలకు ప్లాన్చేస్తున్నారు.
మిగతా చోట్ల ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ఉమ్మడి జిల్లా ప్రచార బాధ్యతలు ఎమ్మెల్సీ కవిత చూసుకోనున్నారు. గ్రేటర్తో పాటు ఉత్తర తెలంగాణ బాధ్యతలు మంత్రి కేటీఆర్, ఉమ్మడి మెదక్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రచారాన్ని మంత్రి హరీశ్రావుకు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్వచ్చే లోపే కేటీఆర్, హరీశ్రావు 60కి పైగా నియోజకవర్గాలను చుట్టేశారు. ఎన్నికల షెడ్యూల్రావడానికి కొద్దిసేపటి ముందే జయశంకర్భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ను కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వార అధికారిక కార్యక్రమాలను ఆపేసి పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు ప్రగతి భవన్లోనే ఉండి ప్రభుత్వపరంగా చక్కబెట్టాల్సిన కార్యక్రమాలపై ఫోకస్చేశారు. బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి పండుగలను మినహాయించి కేటీఆర్, హరీశ్రావు నిత్యం ప్రజల్లోనే ఉండేలా షెడ్యూల్సిద్ధం చేస్తున్నారు.