
రేపు యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. సోమవారం ఉదయం 11 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి కేసీఆర్ వెళ్లనున్నారు. ముగింపు దశలో ఉన్న పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఆలయ పున: సంప్రోక్షణ నిర్వహించనున్నారు. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై చర్చించనున్నారు. మార్చి 22వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై చర్చించనున్నారు సీఎం.
సోమవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీంటినీ సీఎం పరిశీలించనున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రధాన ఆలయం, క్యూలైన్లు, శివాలయం, పుష్కరిణిని పరిశీలించనున్నారు. యాదాద్రిలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి.
ఇవి కూడా చదవండి: