దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సోమవారం ఫేస్ మాస్క్ ధరించే ప్రగతిభవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ నుండి తనను తాను రక్షించుకునేందుకు శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకున్నారు. కరోనా విస్తృతంగా వ్యాప్తి అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ మాస్క్లు ధరించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దృష్ట్యా సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రతిరోజు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ ను పొడిగించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. #IndiaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/1oaLmYO5pS
— Telangana CMO (@TelanganaCMO) April 13, 2020