
ఇండియాలో మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం (జూన్ 18) మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు, గూగుల్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఇండియాలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించడం విశేషం. ప్రపంచంలో ఇప్పటి వరకు 4 సెంటర్లు ఉండగా.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సెంటర్5వది.
2024 అక్టోబర్ లో అమెరికా పర్యాటనలో భాగంగా తెలంగాణలో సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు సీఎం రేవంత్. అందులో భాగంగా ఎంవోయూ కుదుర్చుకున్నారు. నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం ప్రారంభించారు.
గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ హబ్ గా పనిచేస్తుంది. ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.