కంచ గచ్చిబౌలి భూముల వివాదం..ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా కంటే డేంజర్: సీఎం రేవంత్

కంచ గచ్చిబౌలి భూముల వివాదం..ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా కంటే డేంజర్: సీఎం రేవంత్

కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాదీశారు. అధికారులు, మంత్రులతో రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై సీరియస్ అయ్యారు.   నిజం చెప్పేలోపు అబద్ధం సోషల్ మీడియాను చుట్టేసిందన్నారు. ఏఐ ద్వారా ఉన్నవి లేనట్లు..లేనివి ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లు ఆడియోలు..బుల్డోజర్లతో జింకలు గాయపడ్డట్లు సృష్టించారని మండిపడ్డారు. ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారు..దీనిపై  కోర్టుకెళ్లాలని అధికారులను ఆదేశించారు రేవంత్. కిషన్ రెడ్డి కూడా  ఈ వీడియోలు నిజమని పోస్ట్ చేశారని చెప్పారు.

కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారు. వాటిని నిర్మించే సందర్భాల్లో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమవుతోంది.  

►ALSO READ | డుమ్మాలకు కేరాఫ్ కేసీఆర్.. కీలక సమావేశాలకు గైర్హాజరు

ఫేక్ కంటెంట్ భవిష్యత్ లో యుద్దానికి బీజం వేస్తుంది. ఫేక్ వీడియోలు కరోనా కంటే డేంజర్.  రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి.  ఏఐ ఫేక్ కంటెంట్ ను కనిపెట్టేందుకు ఫోరెన్సిక్, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్ ను సిద్ధం చేసుకోవాలి.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.