నేడు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం

నేడు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిగిలిన నాలుగు లోక్​సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్​ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్​చార్జి దీపాదాస్ మున్షి, సీఈసీ సభ్యుడు మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తదితరులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ నాలుగు స్థానాలపై ఇప్పటికే స్క్రీనింగ్​ కమిటీ చైర్మన్​ హరీశ్​ చౌదరి హైదరాబాద్​లో నేతలతో చర్చించారు. వరంగల్​, ఖమ్మం, కరీంనగర్​, హైదరాబాద్​ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించారు. స్క్రీనింగ్​ కమిటీ నిర్వహించిన సర్వేతో పాటు సునీల్​ కనుగోలు నివేదికలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించనున్నారు.