ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక.. పదేళ్లలో ప్రపంచమంతా హైదరాబాద్ రావాల్సిందే: సీఎం రేవంత్

ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక.. పదేళ్లలో  ప్రపంచమంతా హైదరాబాద్  రావాల్సిందే: సీఎం రేవంత్

హైదరాబాద్ లో నిర్మించబోయే  ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  2034 వరకు ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ నగరాన్ని చూడడానికి రావాల్సిందేనన్నారు. ప్రపంచంలోని  అన్ని రకాల సాంకేతిక విభాగాలు ఫ్యూచర్ సిటీ నుంచే పనిచేస్తాయన్నారు రేవంత్.  అభివృద్దిని అడ్డుకునే వాళ్లే శత్రువులని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి వచ్చే వాళ్లను ప్రజలే అడ్డుకోవాలని సూచించారు రేవంత్. హైదరాబాద్ అభివృద్ది జరగాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనన్నారు .

న్యూయార్క్, టోక్యో, సింగపూర్ తో హైదరాబాద్ పోటీ

గచ్చిబౌలిలోని తాలిమ్ లో  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ ..ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..న్యూయార్క్, టోక్యో సింగపూర్ తో హైదరాబాద్ కు పోటీ మూసీ ప్రక్షాళన కొంత మందికి ఇష్టం లేదు.  హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 15 ఏళ్లుగారాష్ట్రం క్రీడల్లో వెనుకబడిపోయింది.  మూసీ వద్దంటున్నారు..ఫ్యూచర్ సిటీ వద్దంటున్నారు.  ఆనాడు కూడా ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టును కొందరు హేళన చేశారు.  నాటి సీఎంల ముందు చూపుతోనే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కు  వచ్చాయి.  హైదరాబాద్ ను అభివృద్ది చేయాలంటే  మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.  ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన చేయాలి.  గంగా,యమునా,సబర్మతిని వాళ్లు ప్రక్షాళన చేసుకోలేదా?. గజం స్థలం దొరకనోళ్లు మూసీ మురికిలో  ఇబ్బంది పడుతున్నారు.   మూసీని ప్రక్షాళన చేసి నైట్ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం. మూసీ పరివాహక ప్రాంతంలో 24 గంటలు వ్యాపారం జరిగేలా చూస్తాం.   మూసీలో 24 గంటలు  నీళ్లు ఉండేలా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం . మూసీ రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తాం. ట్రిపుల్ రావాలంటే నగరం విస్తరించాలి.  ఎలివేటెడ్ కారిడార్లు,మెట్రోను కనెక్టివిటీ చేస్తాం. 

తెలుగు వాళ్లు లేకపోతే అమెరికాలో ఐటీ కంపెనీలు నడవవు

2047 లక్ష్యంగా తెలంగాణ అడుగులేస్తోంది. హైటెక్ సిటీకి కాంగ్రెస్ హయాంలోనే పునాది రాయి. ఐటీ అభివృద్ది వెనుక రాజీవ్ గాంధీపాత్ర ఉంది. హైదరాబాద్ అభివృద్ధిలో చాలా మంది పాత్ర ఉందిఅప్పటి కేంద్రమంత్రి జనార్థన్ రెడ్డి వల్ల హైటెక్ సిటీకి పునాది పడింది.  చంద్రబాబు, వైఎస్సార్ కూడా కృషి చేశారు. రాజీవ్ గాంధీ వల్ల దేశంలో ఐటీ రంగం రాణిస్తోంది. హెటెక్ సిటీ వల్ల రాష్ట్రానికి లక్షలాది రూపాయల  ఆదాయం వస్తోంది. హైటెక్ సిటీని ఆనాడు కొంత మంతి అవహేళన చేశారు.   ఇన్ఫోసిస్, గూగుల్,మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నయ్.  మౌలిక వసతుల్లో హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని తెలుగువాళ్లు శాసిస్తున్నారు. తెలుగు వాళ్లు లేకపోతే అమెరికాలో ఐటీ కంపెనీలు నడిచే పరిస్థితి లేదు అని రేవంత్ అన్నారు.