ఏం చేద్దాం !..మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం మంతనాలు

ఏం చేద్దాం !..మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం మంతనాలు

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు సం బంధించి జీవో 9, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడంతో సీఎం రేవంత్​ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికా రులతో  అత్యవసరంగా సమావేశమయ్యారు. అడ్వొకేట్​ జనరల్​, ప్రముఖ న్యాయవాది అభి షేక్​ సింఘ్వీతోనూ హైకోర్టు స్టే, ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇవ్వడంపై చర్చించా రు. ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై లీగల్​ ఓపీనియన్​ తీసుకున్నారు. 

సుప్రీంకోర్టుకి వెళ్లి హైకోర్ట్‌ ఇచ్చి న స్టేను వెకేట్‌ చేయించడమా.. లేదంటే హైకోర్టులోనే తేల్చుకోవాలా అనే దానిపై చర్చించారు. ఇప్పటికే స్థానిక పాలక వర్గాలు లేకపోవడంతో 20 నెలలుగా ఫైనాన్స్​ కమిషన్​ నుంచి నిధులు నిలిచిపోయాయి. దీంతో పాత రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్తూ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం కల్పించే అంశంపైనా చర్చించారు.