అహ్మదాబాద్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి

అహ్మదాబాద్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి

హైదరాబాద్​, వెలుగు: అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై సీఎం రేవంత్​రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత, మృతుల కుటుంబాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో  వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.