- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
- డ్రగ్స్రవాణా, వినియోగంపై సెక్రటేరియెట్లో రివ్యూ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్, నార్కోటిక్స్ నియంత్రణపై సెక్రటేరియెట్ లో సోమవారం ఆయన రివ్యూ నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణ మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీఎస్ నాబ్ ను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతో పాటు ఆ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి శేషాద్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.