
సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను హైదరాబాద్ లో విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను కోరారు. డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలు అనుకూలమైనవన్నారు సీఎం. ఇప్పటికే హైదరాబాద్ లో పలు డిఫెన్స్ సంస్థలున్నాయన్న సీఎం.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు హైదరాబాద్ ను ఎందచుకోవాలని, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం(జూన్ 18) సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యింది. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి,ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ, సీఈవో డా.జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివప్రసాద్, DRDL డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.
►ALSO READ | క్యాబ్ డ్రైవర్లకు కొత్త పోలీస్ యాప్:ప్రయాణికులకు కూడా సురక్షితం..ఓలా, ర్యాపిడోలతో టెన్షన్ లేదు