
ఆదిలాబాద్: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆదిలాబాద్ పోలీసులు పనిచేస్తున్నారు. కొత్త టెక్నాలజీని వినియోగించి భద్రతా ప్రమాణాలను పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారి అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అభయ యాప్ ను ప్రారంభించారు ఎస్పీ అఖిల్ మహాజన్.
ఈ అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ యాప్ లో ఇప్పటికే 3వేల 232 మంది ఆటోలు యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈయాప్ లో రూ. 350లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటోల యజమానులకు ఒక సంవత్సరం పాటు లక్ష ప్రమాద బీమా వర్తింపజేస్తారు. ఈ యాప్ మహిళలు, యువతులు, వృద్ధులు, విద్యార్థులు సులువుగా వినియోగించవచ్చు.
►ALSO READ | మీది (గూగుల్) ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ గవర్నమెంట్: సీఎం రేవంత్
ఆటోలో ముందుభాగం, వెనకభాగంలో, ఆటో లోపల కూడా క్యూఆర్ కోడ్ , ఆటో నడిపే వ్యక్తి వివరాలు ఉంటాయి. అత్యవసర సమయాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ లోకేషన్ ను ట్రాక్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ కలిగిన ఆటోలో ప్రజలు ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.