
హైదరాబాద్: మీది (గూగుల్) ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియాలో మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను బుధవారం (జూన్ 18) హైదరాబాద్లో సీఎం రేవంత్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం (జూన్ 18) మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు, గూగుల్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన జీవితాలన్నీ డిజిటల్గా మారాయని.. మన ఎకానమీ.. గవర్నమెంట్ అన్ని డిజిటల్ అయ్యాయని తెలిపారు. దీంతో డిజిటల్గా సెక్యూర్గా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని.. దీనికి ఆనంద్ మహీంద్రా చైర్మెన్గా ఉంటున్నారని తెలిపారు. సర్టిఫికేట్లు ఒక్కటే కాదని.. యువతకు నైపుణ్యాన్ని కూడా అందించాలని కోరారు. రాష్ట్రంలోని- కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చబోతున్నామని చెప్పారు. గూగుల్ క్యాంపస్ 2 ఎకరాల్లో ఉంది.. కానీ మా మహిళల క్యాంపస్ మీ ఆఫీసు ముందు మూడున్నర ఎకరాల్లో ఉందని.. వాళ్ళే మీ కాంపిటీటర్స్ అని అన్నారు. ట్రాన్స్ జెండర్స్కు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ వ్యవస్థలోకి తీసుకున్నామని గుర్తు చేశారు.