ఎంపీ పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా

ఎంపీ పదవికి  సీఎం రేవంత్ రెడ్డి  రాజీనామా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని స్పీకర్ వద్దకు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్పీకర్ కు తన రాజీనామా పత్రాన్ని.. అందజేశారు.

డిసెంబర్ 7వ తేదీ గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా.. పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.కేబినెట్ లో మరో ఆరుగురు మంత్రులను ఎంపిక చేయాల్సి ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి.  రేపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్య చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.