
రాజేంద్రనగర్లోని కరాచీ బేకరీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఎ లా జరిగిందనే దానిపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా ఉత్తర్ప్రదేశ్ వాళ్లు ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.
రాజేంద్రనగర్లోని కరాచీ బేకరీలో డిసెంబర్ 14న ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గ్యాస్ లీకైన సమయంలో బేకరి కిచెన్ లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ముందుగా శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చేర్చారు.