కరాచీ బేకరీలో అగ్నిప్రమాదం.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

కరాచీ బేకరీలో అగ్నిప్రమాదం..  సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో జరిగిన  అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రమాదం ఎ లా జరిగిందనే దానిపై ఆరా తీశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను  సీఎం ఆదేశించారు.  క్షతగాత్రుల్లో ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌ వాళ్లు ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.    

రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో డిసెంబర్ 14న ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది.   ఈ  ఘటనలో 15 మంది గాయపడ్డారు.  ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

గ్యాస్ లీకైన సమయంలో బేకరి కిచెన్ లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ముందుగా శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే  పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చేర్చారు.