
హైదరాబాద్: రాబోయే వందేండ్ల అవసరాలకు తగినట్టుగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రెండేండ్లలో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీ హెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు.. ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముం దుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొం దించుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఆస్పత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులుకు సీఎం సూచించారు.
►ALSO READ | Trafic voilence: సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ.. దొరికితే కోర్టుకు వెళ్లాల్సిందే: సీపీ సజ్జనార్
హైదరాబాద్లో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న దవాఖానలు, మెడికల్ కళాశాలల పర్య వేక్షణకు అధికారులను నియమించా అని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీ నివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్ రాజ్, క్రిస్టి యానా జోంగూ, ఇలంబర్తి, ముషారప్ అలీ ఫరూఖీ, హరిచందన తదితరులు పాల్గొన్నారు.