
హైదరాబాద్ సిటీలో సెల్ ఫోన్ డ్రైవింగ్పై నజర్పెట్టారు కొత్త సీపీ సజ్జనార్. సీపీ ఆదేశాల మేరకు వారం రోజులుగా ట్రాఫిక్ పోలీసులు సిటీ మొత్తం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సెల్ ఫోన్చూస్తూ, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటివరకు 3500 కేసులు నమోదు చేశారు.
కొందరు డ్రైవింగ్ చేస్తూ రీల్స్, సినిమాలు, క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నారు. ఫోన్లు, మినీ టీవీలతో డ్రైవింగ్పై కాన్సంట్రేషన్ పోతుంది. సెల్ ఫోన్ మాట్టాడినప్పుడు డ్రైవర్ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది.సెల్ ఫోన్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. వారం నుంచి 3600 సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశాం..సెల్ ఫోన్ డ్రైవింగ్ లో పట్టుబడితే కోర్టు వెళ్లాల్సిందేనన్నారు. కోర్టు తీర్పును బట్టి చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ శ్రీనివాస్