Good News : TSPSC ఎగ్జామ్స్ అన్నీ రీ షెడ్యూల్

Good News : TSPSC ఎగ్జామ్స్ అన్నీ రీ షెడ్యూల్

నిరుద్యోగులకు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త  చెప్పింది. డిసెంబర్ 11వ తేదీ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్ పీఎస్సీ  చైర్మన్ , సెక్రెటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్ పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 కాంగ్రెస్ ప్రకటించిన  జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.  గత ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్లలో పరీక్షల తేదీలను మార్చనుంది. త్వరలో కొత్త పరీక్ష తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 , గ్రూప్ 3 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.