చంచల్ గూడ టు సంతోష్నగర్.. హైదరాబాద్లో మూడో అతి పెద్ద ఫ్లై ఓవర్

చంచల్ గూడ టు సంతోష్నగర్.. హైదరాబాద్లో మూడో అతి పెద్ద ఫ్లై ఓవర్
  •     హాజరుకానున్న సీఎం.. చంచల్​గూడ కాలేజీలో సభ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్​ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌నగర్ వరకు రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల పొడవు,16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా ఈ ఫ్లై ఓవర్​ను నిర్మించారు. ఇందులో భూసేకరణకు రూ.153.37 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో సైదాబాద్, సంతోష్‌నగర్, చంచల్‌గూడ, ఐఎస్‌సదన్, చంపాపేట్, కంచన్‌బాగ్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇది హైదరాబాద్​లో మూడో అతిపెద్ద ఫ్లై ఓవర్​గా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సుమారు ఆరేండ్లపాటు కొనసాగాయి. భూసేకరణ, కరోనా, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో పనులు అనుకున్న సమయంలో పూర్తికాలేదు.

సాయంత్రం 4 గంటలకు స్టీల్ ఫ్లైఓవర్​ను ప్రారంభించిన అనంతరం చంచల్ గూడ జూనియర్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.   హైదరాబాద్​లో మూడో అతి పెద్ద ఫ్లై ఓవర్హైదరాబాద్​సిటీలో 2009లో పీవీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వచ్చింది. దీన్ని11.66 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్లుగా నిర్మించారు. ఇది దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్​గా రికార్డును సొంతం చేసుకుంది. సిటీ నుంచి శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు వెళ్లే వారికి ట్రాఫిక్​ సమస్య లేకుండా దీన్ని నిర్మించారు. ఇక ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో రెండో స్థానంలో ఉంది. గతేడాది జనవరిలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న సైదాబాద్​ఫ్లై ఓవర్  నగరంలో మూడో అతిపెద్ద ఫ్లైఓవర్  కానుంది. 2.21 కిలోమీటర్ల పొడవుతో కొత్తగూడ ఫ్లై ఓవర్ నాలుగో స్థానంలోకి చేరింది.