జనవరి15న దావోస్​కు సీఎం రేవంత్ రెడ్డి

జనవరి15న దావోస్​కు సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల15 నుంచి18 మధ్య స్విట్జర్లాండ్​లోని దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సదస్సులో ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు.