
హైదరాబాద్ లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. శిల్పా లే ఔట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ను జూన్ 28 న ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి(పేజేఆర్) పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రారంభోత్సవం వరకు ఫ్లై ఓవర్ పెయింటింగ్, లైటింగ్ తో పాటు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఫ్లై ఓవర్ ఓపెన్ అయ్యాక ఐటీ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోనున్నాయని మేయర్ విజయలక్ష్మి అన్నారు. నగర పౌరులకు ప్రయోజనం చేకూర్చే నాణ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించడానికి జీహెచ్ఎంసీ కట్టుబడి ఉందని చెప్పారు.
►ALSO READ | AI ఒక సాధనం మాత్రమే..స్కిల్స్ ఉన్నవారికి ఎటువంటి ముప్పూ లేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్కు రూ. 178 కోట్లు ఖర్చు పెట్టారు. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లే వారికి ఇబ్బందులు తప్పుతాయి.