తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికి అనుసరణీయమని చెప్పారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్ప డిందని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన, పారదర్శకంగా, ప్రజాస్వామ్యంగా సాగుతుందని సీఎం పేర్కొన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషం, ఆనందోత్సా హాలతో క్రిస్మస్ జరుపుకోవాలన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి పాటు పడాలని సీఎం కోరారు.

-