లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి

లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత  భౌతిక కాయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.  లాస్య నందిత   కుటుంబ సభ్యులను ఓదార్చారు.  సీఎంతో పాటుగా మంత్రులు పొంగులేటి,  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ లాస్య నందిత  భౌతికకాయానికి  నివాళులర్పించారు. 

మరికాసేపట్లో అధికార లాంఛనాలతో ఈస్ట్ మారేడ్ పల్లి స్మశానవాటికలో  లాస్య నందిత అంత్యక్రియలు జరగనున్నాయి.  శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.  తలకు బలమైన గాయం, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ వల్లే లాస్య నందిత చనిపోయినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు.