- గృహజ్యోతి పథకం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నేతల వెల్లడి
చేవెళ్ల, వెలుగు: ఈనెల 27న చేవెళ్లలో గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్), రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్చార్జి భీం భరత్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా 27న గృహజ్యోతిని చేవెళ్లలో ప్రారంభించడం సంతోషకరమన్నారు.