YSR కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్

YSR కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని  ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం(అక్టోబర్-10) ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ YSR కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 6విడతలుగా… మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

మరిన్ని వార్తలు