మెట్రో రైల్ భవన్ కు సీఎం పేషీలు షిప్ట్

మెట్రో రైల్ భవన్ కు సీఎం పేషీలు షిప్ట్

సచివాలయంలోని విభాగాలన్నీ ఒక్కొక్కటిగా మెట్రో రైల్ భవన్ కు తరలిస్తున్నారు అధికారులు. ఇవాళ (శనివారం) సెక్రటేరియట్ లోని సీఎంవో సెక్రటరీల ఫేషిలను బేగంపేట మెట్రో రైల్ భవన్ కు తరలించారు అధికారులు.  సీఎంవో సెక్రటరీలు నర్సింగ్ రావు,భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, ఫేషిలను బేగంపేట మెట్రో రైల్ భవన్ కు షిఫ్ట్ చేశారు. సోమవారం నుంచి మెట్రోరైల్ భవన్ నుంచే ముఖ్యమంత్రి సెక్రటరీలు, వాళ్ళ పీఎస్ ల అధికారిక విధులు నిర్వర్తించనున్నారు.