కోయంబత్తూర్ పేలుడు..ఎన్ఐఏ దర్యాప్తు కోరిన స్టాలిన్

కోయంబత్తూర్ పేలుడు..ఎన్ఐఏ దర్యాప్తు కోరిన స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోయంబత్తూర్లో ఈనెల 23న జరిగిన కారు పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును కోరారు. ఎన్ఐఏ దర్యాప్తుకు రికమెండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఈ కేసులో స్థానిక పోలీసులు చేస్తున్న దర్యాప్తులో అంతరాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు బయటపడడంతో ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సహా ఏఐఏడీంకే నేతలు ఎన్ఐఏ దర్యాప్తుకు డిమాండ్ చేశారు.

ఈ నెల 23న కోయంబత్తూరులోని ఉక్కడంలో ఓ కారులో సిలిండర్ పేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఘటన  వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. పేలుడుకు ముందు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు పోలీసులకు పలు అనుమానాలను రేకెత్తించాయి. ఈ ప్రమాదంలో మొబిన్ అనే వ్యక్తి మరణించాడు. మొబిన్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు.. మొబిన్ ఇంటి నుంచి తెచ్చిన బస్తాను కారులో పెట్టిన కొద్దిసేపటికీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.