- కలెక్టర్ హైమావతి
గజ్వేల్, వెలుగు: గురుకుల విద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతి, భోజనం, సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం ఆమె గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల స్కూల్, జూనియర్ కాలేజీ, బాలికల గురుకుల స్కూల్, జూనియర్ కాలేజీని ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కిచెన్లోకి వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనాన్ని మెనూ ప్రకారం చేయాలని ఇష్టానుసారం చేస్తే సహించేది లేదన్నారు. పరిశుభ్రతను పాటించాలని పారిశుధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. గురుకుల విద్యాలయాల్లో కామన్మెనూ పాటించని, పరిశుభ్రంగా ఉంచని వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారి కి ఫోన్ ద్వారా ఆదేశించారు.
కలెక్టర్ చేతుల మీదుగా చెక్కు పంపిణీ
చేర్యాల: మండలంలోని వేచరేణి పంచాయతీ సిబ్బంది ఎండీ మోహిన్ పాషా ఈ ఏడాది ఆగష్టు 14న విద్యుత్ షాక్ తగిలి మరణించడంతో ఆయన కుటుంబానికి కలెక్టర్ హైమావతి రూ. 15 లక్షల చెక్కును బుధవారం అందజేశారు.
కార్యక్రమంలో డీపీవో రవీందర్, హనుమంతు, జనగామ పోస్టల్బ్రాంచ్ సీనియర్ మేనేజర్ జేఎల్ సింగ్, మేనేజర్ రమేశ్, భిక్షపతి, చేర్యాల సబ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ బాబు , బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నరసింహులు, పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి దుర్గా రెడ్డి, ఉప సర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు, సెక్రటరి రాజు పాల్గొన్నారు
