కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: రాజీవ్​ గాంధీ హన్మంతు

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: రాజీవ్​ గాంధీ హన్మంతు

డిచ్​పల్లి, ఇందల్వాయి, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ​రాజీవ్​ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం బర్దీపూర్, ఇందల్వాయి గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్ ​యాదిరెడ్డి తో కలిసి ఆయన కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని సెంటర్లకు తీసుకరావాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2203, బీ గ్రేడ్​కు రూ. 2183 ధర చెల్లిస్తారన్నారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్ ​సప్లయ్​ ​డీఎం జగదీశ్, ఇందల్వాయి పీఏసీఎస్ ​చైర్మన్​ చింతలపల్లి గోవర్ధన్​రెడ్డి, ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.