
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతిలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్జితేశ్ వీ పాటిల్ సూచించారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చెలకలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ రికార్డులలో పేర్ల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చు, తగ్గులు, పట్టా పాస్ బుక్లు లేకపోవడం, సర్వే నెంబర్ల మిస్సింగ్, హద్దుల నిర్ధారణ వంటి పలు భూ సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో ఆర్డీవో మధు పాల్గొన్నారు.
ఈవీఎంల గోడౌన్ల తనిఖీ ..
కొత్తగూడెంలోని ఈవీఎంల గోడౌన్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదితో పాటు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
‘జేఎస్జేబీ’కి కేంద్రం నుంచి జిల్లాకు ప్రశంసలు
జల సంచాయి జన భాగిదారి(జేఎస్జేబీ) ప్రోగ్రామ్ను విజయవంతం చేయడంలో జిల్లా చేసిన కృషికి కేంద్రం నుంచి ప్రశంసలు వచ్చాయని కలెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన హోల్ గవర్నమెంట్, హోల్ ఆఫ్ సొసైటీ అనే భావనను అత్యంత ప్రభావంతంగా ఆచరణలోకి తీసుకువచ్చిన జిల్లాకు భద్రాద్రికొత్తగూడెంకు గుర్తింపు రావడం అధికారులు, ఉద్యోగుల కృషేనని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 29,103సోక్ పిట్స్ను ఇప్పటి వరకు నిర్మించామని, మరో 2,581 సోక్ పిట్స్ నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రైతులకు 1,100 నీటి కుంటలను సాంక్షన్సాంక్షన్ చేశామని,399 కుంటలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.