రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి :  కలెక్టర్​జితేశ్​ వీ పాటిల్

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి :  కలెక్టర్​జితేశ్​ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతిలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​ వీ పాటిల్​ సూచించారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చెలకలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ రికార్డులలో పేర్ల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చు, తగ్గులు, పట్టా పాస్​ బుక్​లు లేకపోవడం, సర్వే నెంబర్ల మిస్సింగ్​, హద్దుల నిర్ధారణ వంటి పలు భూ సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో ఆర్డీవో మధు పాల్గొన్నారు. 

ఈవీఎంల గోడౌన్ల తనిఖీ ..

కొత్తగూడెంలోని ఈవీఎంల గోడౌన్లను కలెక్టర్​ తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదితో పాటు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. 

‘జేఎస్​జేబీ’కి కేంద్రం నుంచి జిల్లాకు ప్రశంసలు

జల సంచాయి జన భాగిదారి(జేఎస్​జేబీ) ప్రోగ్రామ్​ను విజయవంతం చేయడంలో జిల్లా చేసిన కృషికి కేంద్రం నుంచి ప్రశంసలు వచ్చాయని కలెక్టర్​ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన హోల్​ గవర్నమెంట్, హోల్​ ఆఫ్​ సొసైటీ అనే భావనను అత్యంత ప్రభావంతంగా ఆచరణలోకి తీసుకువచ్చిన జిల్లాకు భద్రాద్రికొత్తగూడెంకు గుర్తింపు రావడం అధికారులు, ఉద్యోగుల కృషేనని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 29,103సోక్​ పిట్స్​ను ఇప్పటి వరకు నిర్మించామని, మరో 2,581 సోక్​ పిట్స్​ నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రైతులకు 1,100 నీటి కుంటలను సాంక్షన్​సాంక్షన్​ చేశామని,399 కుంటలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.