16 నుంచి ఓటర్​ స్లిప్పుల పంపిణీ : కలెక్టర్​ ప్రియాంక అల

16 నుంచి ఓటర్​ స్లిప్పుల పంపిణీ : కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఈనెల 16 నుంచి ఓటర్​ స్లిప్పులు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్​ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం కలెక్టరేట్​లో రిటర్నింగ్​ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో ఆమె మాట్లాడారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఓటరుకూ పోలింగ్​ స్లిప్పులు అందించాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణకు నోడల్​ ఆఫీసర్​ను నియమించామన్నారు. సమావేశంలో రిటర్నింగ్​ అధికారులు ప్రతీక్​ జైన్​, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తీక్​ పాల్గొన్నారు. 

రిటర్నింగ్​ అధికారులు అలర్ట్​గా ఉండాలి 

నామినేషన్ల విత్​డ్రాకు బుధవారం చివరి తేదీ కావడంతో రిటర్నింగ్​ అధికారులు అలర్ట్​గా  ఉండాలని కలెక్టర్​ సూచించారు. నామినేషన్​ దాఖలు చేసిన క్యాండెట్ల నుంచి డిక్లరేషన్​ ఫారం తీసుకొని తెలుగు అక్షరమాల ప్రాతిపదికన బ్యాలెట్​ పేపర్​ లిస్ట్​ తయారు చేస్తూ ఇండిపెండెంట్​ క్యాండెట్లకు గుర్తులను కేటాయించాలన్నారు. కౌంటింగ్​ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలన్నారు.