మెదక్టౌన్, వెలుగు: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్సూచించారు. మంగళవారం తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్మాట్లాడుతూ.చిన్నప్పుడు నిర్వహించిన టాలెంట్ టెస్టులో తాను అప్పటి హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు కూడా గణితంతో పాటు అన్ని విషయాల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో విజయ, జిల్లా ఏసీజీఈ కరుణాకర్, డీఎస్వో రాజిరెడ్డి, ఎస్ఎస్ఏ అధికారులు నవీన్, రాజు, ఎంఈవోలు శంకర్, మధు మోహన్ , ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొండల్ రెడ్డి, గోపాల్, నాగరాజు, బాలరాజు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
విజేతల వివరాలు..
ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ బహుమతి రామాయంపేట మండలం కోనాపూర్కు చెందిన జడ్పీహెచ్ఎస్ విద్యార్థి విఘ్నేష్, ద్వితీయ బహుమతి మాచవరం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఉదయ్ కుమార్, మూడో బహుమతి తేజస్విని సాధించారు. తెలుగు మీడియంలో శివ్వంపేట కేజీబీవీకి చెందిన సక్కుబాయి, ద్వితీయ బహుమతిని టేక్మాల్ కేజీబీవీ విద్యార్థిని శ్రీచందన, తృతీయ బహుమతిని హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లికి చెందిన సింధూజ దక్కించుకున్నారు.
ఉర్దూ మీడియంలో మెదక్లోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న జియాబేగం, జువేరియా ఫాతిమా ప్రథమ బహుమతి, రెండో బహుమతి చేగుంట టీజీఎమ్ఎస్కు చెందిన ఆదిత్య, మూడో బహుమతిని టీజీఆర్ఎస్ మెదక్ విద్యార్థిని రుచిత సాధించారు. కలెక్టర్ విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు డాక్టర్ పెంటాగౌడ్, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ నరేందర్ రెడ్డిని సన్మానించారు.
