కులవృత్తుల సంక్షేమం కోసమే బీసీ బంధు : రాజర్షి షా, పద్మా దేవేందర్​రెడ్డి

కులవృత్తుల సంక్షేమం కోసమే బీసీ బంధు : రాజర్షి షా, పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు: కుల వృత్తుల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు ప్రవేశపెట్టిందని  కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్​లో లబ్ధిదారులకు మూడో విడత బీసీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​రాజర్షి షా మాట్లాడుతూ.. కుల వృత్తుల వారు అధునాతన పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం బీసీ బంధు కింద రూ. లక్ష కేటాయిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు.  బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.ఈ  కార్యక్రమంలో  జిల్లా అడిషనల్​ కలెక్టర్​ రమేశ్, జడ్పీ వైస్​ చైర్​ పర్సన్​లావణ్య, మున్సిపల్​ చైర్మన్​చంద్రపాల్​,  వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,  జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.