ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు : రాజీవ్​ గాంధీ హన్మంతు 

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు :  రాజీవ్​ గాంధీ హన్మంతు 

నిజామాబాద్​, వెలుగు :  జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు తెలిపారు. మొత్తం 13,89,291 ఓటర్ల కోసం 1,549 పోలింగ్​ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఆయన తన ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. 80 ఏండ్లు దాటిన సీనియర్​ సిటిజన్స్​17,580 ఉండగా, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు 23,919 ఉన్నారన్నారు. ఎన్నికల కమిషన్ ​ఆదేశాల మేరకు ఫారం–12 (డి) అందించిన వారికి ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. వీడియో షూటింగ్​మధ్య పారదర్శకంగా వారు ఓట్లు వేస్తారన్నారు. పోస్టల్​ బ్యాలెట్ ​కోరిన ఓటర్లను పోలింగ్​సెంటర్లలోకి అనుమతించరన్నారు. 1,778 పోలింగ్ ఆఫీసర్లు, 1,774 ఏపీవోలు, 3,599  సహాయకులు ఎన్నికల కోసం పనిచేస్తున్నారన్నారు.

also read : పార్టీ మారటం లేదు.. నామినేషన్ నేనే వేస్తున్నా : అద్దంకి దయాకర్
 

69 రివాల్వర్ల డిపాజిట్ :  సీపీ

జిల్లాలో 69 లైసెన్స్​ రివాల్వర్లను డిపాజిట్​ చేయించామని సీపీ కల్మేశ్వర్​ సింగెనవార్ ​తెలిపారు. 260 మంది రౌడీషీటర్లు, 41 కమ్యూనల్​ రౌడీలను బైండోవర్​ చేశామన్నారు. 2018, 19 ఎన్నికల్లో కేసులు నమోదైన 450 మందిని సైతం బైండోవర్​చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ ​కేంద్రాలను గుర్తించామని అక్కడ అదనపు బందోబస్తు కల్పిస్తామన్నారు. జిల్లాకు తొమ్మిది కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించారన్నారు. ఎన్నికల అడిషనల్​కలెక్టర్ ​యాదిరెడ్డి, డీసీపీ జయరాం ఉన్నారు.