జనగామ/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెట్రోల్, డీజిల్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు సందీప్కుమార్ఝా, అంకిత్ హెచ్చరించారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో గురువారం నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరికైనా క్యాన్లలో ఎక్కువగా విక్రయిస్తే బంకులపై చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం జనగామ కలెక్టర్నిర్వహించిన మీటింగ్లో జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలు తప్పనిసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
