మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం నేలకొరిగిన వృక్షాలను మంగళవారం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రభాకర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వికాస్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూమి సారవంతంగా ఉంటుందని, లూజ్ సాయిల్ లో తల్లి వేరు వ్యవస్థ భూమిలోకి చొచ్చుకుపోకపోవడంతో బలమైన గాలులు రావడంతో చెట్లు నేలకూలాయని తెలిపారు.
కూలిపోయిన చెట్లలో విలువైన వాటిని వెంటనే డిపోకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంటన ఎఫ్డీవో వజ్రా రెడ్డి, ఇన్చార్జి ఎఫ్ఆర్వో లాయక్ హుస్సేన్, మంగపేట సౌత్ బీట్ ఆఫీసర్ మోడెం పుణ్యవతి, నార్త్ బీట్ ఆఫీసర్ దుడ్డు ప్రవీణ్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు
