
హైదరాబాద్: ‘అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్’ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు నటుడు అలీ. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు అచ్చిరెడ్డి, జయచంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, హీరో రవివర్మ కార్యక్రమానికి హాజరై లోగోను ఆవిష్కరించారు. ఈ సంస్థలో వెబ్ సిరీస్, టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందిస్తామని తెలిపారు అలీ. శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు. రాబోయే కాలంలో వెబ్ సీరీస్కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. 24 క్రాఫ్ట్లకు సంబంధించిన సేవలను తమ సంస్థలో కల్పిస్తున్నామని, తాను తీయబోయే వెబ్ సిరీస్, టీవీ షోలను అభిమానులు ఆదరించాలని అలీ కోరారు.