మెదక్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లు రోడ్డెక్కారు. పిల్లికోటాల్లోని హాస్టల్ నుంచి ర్యాలీగా బయలుదేరి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రెవెన్యూ అధికారులు వారితో మాట్లాడి కలెక్టరేట్కు తీసుకెళ్లారు. కలెక్టరేట్ గేట్ వద్ద నర్సింగ్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్ లో 120 మంది స్టూడెంట్స్ ఉంటే, ఒకే టాయిలెట్ ఉందని వాపోయారు. బాత్రూమ్ లకు సరఫరా అయ్యే నీళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, చున్నీలతో వడబోసుకుని స్నానాలు చేయాల్సి వస్తోందన్నారు.
భోజనం కూడా క్వాలిటీ సరిగా ఉండడం లేదన్నారు. రూ.5 వేల స్టైఫండ్ సైతం సకాలంలో రావడం లేదని వాపోయారు. ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్టూడెంట్ సమస్య తెలుసుకొని డీఐడీవో మాధవిని విచారణకు ఆదేశించారు. అనంతరం ఆమె ఆర్ఐ లక్ష్మణ్తో కలిసి నర్సింగ్ హాస్టల్ను సందర్శించి సౌలతులను పరిశీలించారు.
