ఛత్తీస్‌ఘడ్‌లో తుపాకీతో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య

ఛత్తీస్‌ఘడ్‌లో తుపాకీతో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య

ఛత్తీస్‌ఘడ్: బస్తర్ జిల్లా కరణ్ పూర్‌లో ఉన్న కోబ్రా 19 బెటాలియన్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న కంపెనీ కమాండర్ కుబేర్ సింగ్ మంగళవారం తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నక్సల్స్ దాడుల్లో 23మందికిపైగా జవాన్లు.. నలుగురు నక్సలైట్లు మృతి చెందడం.. ఎదురు కాల్పుల సందర్భంగా తమకు పట్టుపడిన ఓ జవాన్ ను నక్సలైట్లు మధ్యవర్తుల సమక్షంలో ప్రజా కోర్టు నిర్వహించి విడుదల చేసిన ఘటనల వేడి ఇంకా చల్లారక ముందే కమాండర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటకొచ్చింది.