జోగిపేట,వెలుగు: జోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలని వైద్యవిధాన పరిషత్ కమిషనర్అజయ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన జోగిపేట హాస్పిటల్ను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగు పర్చాలన్నారు. సాధారణ డెలివరీలను పెంచాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తనకు చెబితే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు.
డెంటల్ విభాగంలో కొత్త ఎక్విప్మెంట్వస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను ఇక్కడికి షిప్ట్ చేస్తామన్నారు. ఆక్సిజన్ ప్లాంటు అందుబాటులో ఉందన్నారు. గత నెల 9న కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేయగా 11 మంది వైద్యులు గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కమిషనర్ వెంట హాస్పిటల్ సూపరింటెండ్ డాక్టర్ సౌజన్య ఉన్నారు.
