శ్రీశైలం ఘటనపై టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ అధ్యక్షతన కమిటీ

శ్రీశైలం ఘటనపై టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ అధ్యక్షతన కమిటీ

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఘోర‌ ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించింది. ఈ ఘటన పై టీఎస్ ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి అధ్యక్షతన 4గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జేఎండి శ్రీనివాసరావు, ట్రాన్స్మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి , టీఎస్ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానందం, కన్వీనర్ రత్నాకర్ ఉన్నారు. సీఐడీతో సంబంధం లేకుండా వీరు ప్రత్యేక దర్యాప్తు చేయనున్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ట్రాన్స్ కో ,జెన్కో సిఎండి ప్రభకార్ రావు వీరిని అదేశించారు.

Committee chaired by TSSPDCL CMD in Srisailam power plant fire accident