టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ వాళ్లు తిరిగి రావాలి

 టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ వాళ్లు తిరిగి రావాలి
  • మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

కరీంనగర్:  టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ వాళ్లు అక్కడ ఖాళీగా ఉన్నారు.. వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. 
పార్టీ విడిచివెళ్లిన వారిని చేర్చుకునేందుకు మాజీ మంత్రి, సీనియర్ నేత కె.జానారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చిరుమామిడి మండలంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు టీఆర్ఎస్, ఇటు  బీజేపీ ఇచ్చిన హామీలు అమలు మీద  పోరాటం చేస్తూనే... పార్టీని పటిష్ట చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్లిన నాయకులు తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు జానారెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు నాయ్యం చేయలేకపోతున్నాయని, ఆ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పాతవారిని తిరిగి  పార్టీలోకి రావాలని  కోరామన్నారు. 

 

ఇవి కూడా చదవండి